గుండెపోటుతో మృతి చెందిన గోగ్గుల వెంకటేశ్వర్లుకు పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలం పాపాయిగూడెం గ్రామానికి చెందిన గోగ్గుల వెంకటేశ్వర్లు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఆయన నివాసానికి చేరుకుని, వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
తరువాత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు యర్ర సురేష్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 29









