ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఆటో ను ఢీ కొట్టిన బులోరో.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆటో ను ఢీ కొట్టిన బులోరో.
తాడ్వాయి ,ఆధాబ్ న్యూస్ :
తాడ్వాయి గెస్ట్ హౌస్ వద్ద గుర్తు తెలియని వాహనం(బొలెరో) ఆటోను ఢీ కొనడంతో పినపాక మండలంలోని గోపాలరావుపేట గ్రామానికి చెందిన గోరెంట్ల.శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు.గోరెంట్ల శ్రీను రెండో కుమారుడు వివాహం జరిగి నాలుగు,ఐదు రోజులు అయింది.వేములవాడ రాజన్న దర్శనం కోసం కరకగూడెం మండలంలోని మోతె గ్రామం నుండి సోమవారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ఆటోలో బలుదేరగా
తాడ్వాయికి రెండు కిలో మీటర్లు దూరంలో సూమరు ఉదయం 5 గంటల సమయంలో తాడ్వాయి వైపు నుండి వస్తున్న గుర్తుతెలియని వాహనం అతి వేగంగా ఆటోను ఢీ కోట్టడంతో ఆటోలో ప్రయాణం చేస్తున్న శ్రీను తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించాడు.ఆటోలో ఉన్న పలువురికి గాయాలు అయ్యాయి.విషయం తెలుసుకున్న తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సంఘటన స్థలముకు చేరుకొని
కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతుడి భార్య కూడా 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించారు.తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు కుమారులు విగత జీవులుగా మిగిలారు.కుమారుడి వివాహం అయిన నాలుగు,ఐదు రోజులకే రోడ్డు ప్రమాద రూపంలో శ్రీను అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో,గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!