పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించిన మహంకాళి అనసూర్యమ్మ
బూర్గంపాడు ,ఆధాబ్ న్యూస్
బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామానికి చెందిన మహంకాళి సత్యనారాయణ సతీమణి మహంకాళి అనసూర్యమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఆమె స్వగృహానికి వెళ్లి అనసూర్యమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 33









