మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు పట్టుబడ్డ సీఐ, టీవీ రిపోర్టర్.
మణుగూరు,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో అవినీతి చిట్టా బయటపడింది. మణుగూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సోమ సతీష్ కుమార్ (ఏఓ-1), బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపీ (ఏఓ-2) లను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సమాచారం ప్రకారం, ఒక వ్యక్తి నుండి రూ. 4 లక్షల లంచం డిమాండ్ చేసిన ఈ ఇద్దరు వ్యక్తులు, అందులో రూ. 1 లక్ష తీసుకుంటుండగా మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో ACB అధికారులు వారిని పట్టుకున్నారు. గోపీ, మధ్యవర్తిగా వ్యవహరించి బాధితుల పేర్లు కేసులో చేర్చకుండా చూడాలని ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై కేసు నంబర్ 150/2025 కింద నమోదు చేయబడింది. కేసులో భారతీయ న్యాయ విభాగంలోని BNS సెక్షన్లు 318(4), 329(3) మరియు తెలంగాణ రాష్ట్ర గేమింగ్ సవరణ చట్టంలోని సెక్షన్ 5 వర్తించాయి. ACB అధికారులు రాసాయనిక పరీక్షలు నిర్వహించి, అభియోగాలపై బలమైన ఆధారాలు సేకరించారు.
ఇద్దరినీ అరెస్ట్ చేసిన తరువాత వారిని వారంగల్ ఎస్పీఈ & ఎసీబీ కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతోంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం కావాలని డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ అధికారులకు 1064 నెంబర్కు ఫిర్యాదు చేయవలసిందిగా తెలిపారు









