అధికారుల నిర్లక్ష్యంతో దేశ భద్రతకు తీవ్ర ముప్పు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
కాకినాడ ఆధాబ్ న్యూస్ :
అత్యంత ప్రమాదకర పోర్టుగా కేంద్రానికి లేఖ రాస్తా
రేషన్ బియ్యం మాఫియా నెట్వర్క్ను కట్టడి చేస్తా
ఇప్పుడు బియ్యం ఎగుమతులు రేపు పేలుడు, మత్తుపదార్థాలు దిగుమతి కావని గ్యారెంటీ ఏంటి?
తనిఖీలకు వస్తానంటే 2 నెలలుగా అడ్డుకుంటున్నారు.
సముద్రంలో ఓడపైకి వెళ్లడం కుదరదని అబద్ధాలు.
డిప్యూటీ సీఎంగా నాకే అధికారులు సహకరించలేదు.
నేనొస్తున్నానని తెలిసి జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లారు. కాకినాడ పోర్టులో మీడియాతో పవన్ కల్యాణ్
కాకినాడ పోర్టును ఇలాగే వదిలేస్తే పాకిస్థాన్ వంటి శత్రుదేశాల నుంచి కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ముప్పు పొంచి ఉంది.
ఇలా తీరప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే దేశ భద్రతకే పెను ప్రమాదం. అందుకే కాకినాడ పోర్టు అత్యంత ప్రమాదకరంగా ఉందని ప్రధాని, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా .









