ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వలస ఆదివాసీలకు దోమ తెరలు పంపిణీ

వలస ఆదివాసీలకు దోమ తెరలు పంపిణీ.
కరకగూడెం, నవంబర్ 1(ఆధాబ్ న్యూస్) :నిస్వార్ధ సమాజ సేవ ఎంతో అమూల్యమైందని ఆ దిశగా ప్రతీ ఒక్కరూ అడుగులు వెయ్యాలని ఏడూళ్ళ బయ్యారం సీఐ. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.దీపావళి పండుగను పురస్కరించుకొని కరకగూడెం మండలంలోని రేగళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని మాధన్నగూడెం వలస ఆదివాసీలకు ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’ సభ్యులు,కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ .ముఖ్య అతిధిగా పాల్గొని సుమారు 80 కుటుంబాలకు దోమ తెరలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ సమాజంలో సానుకూల మార్పులను తీసుకువస్తుందని,సామరస్యం,ప్రేమ,సహకారం వంటి గుణాలను పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు.అదేవిధంగా దోమ తెరలను విధిగా వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఆరోగ్యం ఉండడమే నేటి రోజుల్లో గొప్ప ఆస్తి అని అన్నారు.అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో పేదలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై రాజేందర్,ఫౌండేషన్ సభ్యులు షేక్ వసీం అక్రం,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!