ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. మణుగూరు, నవంబర్ 1 (ఆధాబ్ న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ,ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అనుమతితో బుధవారం 6-11-2024 ఆరవ తారీఖు నాడు భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాల యందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుందని జి .సంజీవరావు ఆప్తాల్మిక్ ఆఫీసర్ తెలియజేశారు. గుండాల ,కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారు 4-11-2024 నాడు మణుగూరు ఏరియా హాస్పిటల్ నందు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి .కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి మాత్రమే భద్రాచలం మారుతి నర్సింగ్ కళాశాలకు రిఫర్ చేయవలసి ఉంటుంది అని భద్రాచలం నుండి సికింద్రాబాద్ పుష్పగిరి ఆసుపత్రికి బస్సు ద్వారా తీసుకెళ్లి కంటి ఆపరేషన్లు చేసిన అనంతరం తిరిగి భద్రాచలమునకు తీసుకొని వస్తారు అని. ఉచిత కంటి ఆపరేషన్లు చేయించుకోవాలి అనుకునేవారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు.









