మహిళా కీర్తిరత్న అవార్డుకు జర్నలిస్టు మధులిక ఎంపిక
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
సవ్యసాచి గ్రూప్స్ ఆఫ్ ఇండియా మరియు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందుతున్న శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న “మహిళా కీర్తిరత్న – Women’s Excellence Award 2026” కార్యక్రమానికి భద్రాచలం పట్టణానికి చెందిన జర్నలిస్టు మధులిక ఎంపికయ్యారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డు కార్యక్రమం విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయం, బెంజ్ సర్కిల్ వద్ద నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరి భూషణం మధులికకు జాతీయ ప్రతిభ పురస్కారం అందజేయనున్నట్లు ఆహ్వానం పంపించారు.
పత్రికారంగంలో ఆమె చేస్తున్న సేవలు, సమాజ సమస్యలపై అవగాహన కల్పిస్తూ నిజాయితీతో వార్తలు అందిస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఆహ్వానం పట్ల భద్రాచలం పట్టణ ప్రముఖులు, సహచర జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ మధులికకు అభినందనలు తెలిపారు.








