వంద పడకల ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభం
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు ప్రేరణగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సునీల్, తహసీల్దార్ నరేష్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నూతన బ్లడ్ బ్యాంక్ ప్రారంభం వల్ల అత్యవసర సమయంలో రోగులకు తక్షణ రక్తసరఫరా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Post Views: 43









