సమ్మక్క–సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు
జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనున్నట్లు మేడారం పూజారుల సంఘం ప్రకటన
ములుగు ,ఆధాబ్ న్యూస్:
ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం నాడు మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు అధికారికంగా ప్రకటించారు. 2026 సంవత్సరానికి గాను జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మహా జాతర జరగనుంది.
జాతర తేదీవారీ కార్యక్రమాలు ఇలా ఉన్నాయి:
🔸 28-01-2026 (బుధవారం):
సాయంత్రం 6 గంటలకు శ్రీ సారలమ్మ అమ్మవారు గద్దెకు వెలివేయడం జరుగుతుంది. అదే సమయంలో శ్రీ గోవింద రాజు మరియు పగిడిద్ద రాజులు గద్దెలకు రాగలరు.
🔸 29-01-2026 (గురువారం):
సాయంత్రం 6 గంటలకు శ్రీ సమ్మక్క అమ్మవారు గద్దెకు రాగలరు.
🔸 30-01-2026 (శుక్రవారం):
భక్తులు అమ్మవార్లకు మ్రొక్కుబడులు సమర్పించుకుంటారు. ఇది మహా జాతరలో అత్యంత ముఖ్యమైన రోజు.
🔸 31-01-2026 (శనివారం):
సాయంత్రం 6 గంటలకు శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు మరియు శ్రీ గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగియనుంది.
ఈ మహా జాతర దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద పటముల జానపద పూజారాధనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కోట్లాది భక్తులు ఈ రోజుల్లో మేడారం తీర్థ యాత్రలో పాల్గొంటారు.









