ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆర్‌సిఓను సస్పెండ్ చేయాలి – ఎస్ఎఫ్ఐ డిమాండ్

ఆర్‌సిఓను సస్పెండ్ చేయాలి – ఎస్ఎఫ్ఐ డిమాండ్
ఖమ్మం, జూన్ 16: ఆధాబ్ న్యూస్:
విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న బీసీ వెల్ఫేర్ గురుకులాల ఆర్‌సిఓ రాంబాబు పై తక్షణమే కఠిన చర్యలు తీసుకొని విధుల నుండి తొలగించాలని ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ అనుదీప్ కు వినతి పత్రం అందజేసింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టీ. ప్రవీణ్ మాట్లాడుతూ – “ఆర్‌సిఓ రాంబాబు తన విధుల పట్ల శ్రద్ధ లేకుండా బాధ్యతలను విస్మరిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ఒక్కరోజు కూడా హాజరుకాని వ్యవహారం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యలు చెప్పడానికి ఆఫీస్‌కు వెళ్లినప్పుడు, ఆఫీస్ ఖాళీగా ఉండటం వల్ల వారు అయోమయంలో పడుతున్నారు,” అని విమర్శించారు.

అలాగే, “తాను ఖమ్మంలో ఉన్న బీసీ గురుకులాలకు అధిపతినని భావించుకుంటూ, సమయపాలన లేకుండా తన ఇష్టానుసారంగా పని చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య నేతృత్వానికి తగిన శిక్ష విధించకపోతే, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం,” అని హెచ్చరించారు.

ఈ వినతి కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, నాయకులు త్రినాథ్, లోకేష్, ఉదయ్, మణికంఠ, భాను తదితరులు పాల్గొన్నారు.

📞 భారత విద్యార్థి ఫెడరేషన్ – ఎస్ఎఫ్ఐ, ఖమ్మం జిల్లా కమిటీ
సంప్రదించండి: 8465813109

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!